కోహ్లీ ఫ్లైయింగ్ కిస్..సిగ్గు పడిన అనుష్క శర్మ

కోహ్లీ ఫ్లైయింగ్ కిస్..సిగ్గు పడిన అనుష్క శర్మ

ఐపీఎల్ 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ విజయం సాధించింది. రాజస్థాన్ పై కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఆ తర్వాత బెంగుళూరు బౌలర్ల ధాటికి రాజస్థాన్ కేవలం 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓడిపోయింది. అయితే మ్యాచ్ తర్వాత కోహ్లీ చేసిన పని ప్రస్తుతం వైరల్ అయింది. 

ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ డకౌట్ అయ్యాడు. తొలి బంతికే ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్ లో LBW గా వెనుదిరిగాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ తెగ సంతోష పడిపోయాడు. స్టేడియంలో నిలబడి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సమయంలో కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ డగౌట్ లో కూర్చోని చప్పట్లు కొడుతోంది. అయితే మ్యాచ్ గెలిచిన సంతోషంలో ఉన్న కోహ్లీ అనుష్కపై ముద్దుల వర్షం కురిపించాడు. స్టేడియం మధ్యలో నుంచే ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చాడు. ఇది చూసిన అనుష్క శర్మ తెగ సిగ్గు పడిపోయింది. వీరిద్దరి మధ్య ఈ సీన్ ను చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.