
కె. సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర ప్రధాన పాత్రల్లో భాస్కర్ మౌర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ముత్తయ్య'. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. గతంలో యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైన తొలి తెలుగు సినిమాగాముత్తయ్య రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది మే 9న లండన్లో రిచ్ మిక్స్లో ప్రీమియర్ అయ్యింది.
తాజాగా కోల్కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ భారతీయ చిత్రంగా అవార్డు అందుకుంది. కాంపిటేషన్ ఆన్ ది ఇండియన్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ కేటగిరీలో ఈ పురస్కారం దక్కింది. దీంతో చిత్ర దర్శకనిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ చిత్రం మరింత మందికి స్ఫూర్తిని పంచుతుందన్నారు. తమ చిత్రానికి ఈ గౌరవం దక్కడం గర్వంగా ఉందని తెలిపారు.