ఉత్తమ భారతీయ చిత్రంగా ‘ముత్తయ్య’

ఉత్తమ భారతీయ చిత్రంగా  ‘ముత్తయ్య’

కె. సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర ప్రధాన పాత్రల్లో భాస్కర్ మౌర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ముత్తయ్య'. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. గతంలో యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన తొలి తెలుగు సినిమాగాముత్తయ్య రికార్డ్ సృష్టించింది.  ఈ ఏడాది మే 9న లండన్‌లో రిచ్ మిక్స్‌లో ప్రీమియర్ అయ్యింది. 

తాజాగా కోల్‌కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ భారతీయ చిత్రంగా అవార్డు అందుకుంది. కాంపిటేషన్ ఆన్ ది ఇండియన్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ కేటగిరీలో ఈ పురస్కారం దక్కింది. దీంతో చిత్ర దర్శకనిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ చిత్రం  మరింత మందికి స్ఫూర్తిని పంచుతుందన్నారు. తమ చిత్రానికి ఈ గౌరవం దక్కడం గర్వంగా ఉందని తెలిపారు.