
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో సోమవారం ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో దేవాలయంలోని పలు సేవలకు వేలం నిర్వహించారు. కొబ్బరి ముక్కలు పోగుచేసుకునే హక్కును కురవి గ్రామానికి చెందిన యుగేందర్ రూ.71 లక్షల 77 వేలకు, స్వామికి సమర్పించిన వస్త్రాలు, ఒడిబియ్యం, పసుపు పోగు చేసుకొను హక్కును కొమురవెల్లికి చెందిన ఉప్పల వంశీ కృష్ణ రూ.70 లక్షల 56 వేలకు, కోరమీసాల టెండర్ ను కొమురవెల్లికి చెందిన ఎక్కలదేవి అరుణ రూ.16 లక్షల 61 వేలకు, టాయిలెట్స్ నిర్వహణ మిశ్రా ఎంటర్ ప్రైజెస్ రూ.4 లక్షల 71 వేలకు దక్కించుకున్నారు.
మరి కొన్ని అంశాలకు సరైన పాట రానందున వాయిదా వేశారు.