రాజకీయం కోసం మనుషులను చంపేస్తారా ? : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రాజకీయం కోసం మనుషులను చంపేస్తారా ? : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

బీజేపీ నేత మురళీకృష్ణ గౌడ్ కు జరిగింది ప్రమాదం కాదని.. ఆయనపై హత్యాయత్నం జరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలో చనిపోయిన మురళి కృష్ణ డ్రైవర్ బాలుది ముమ్మాటికి హత్యేనని అన్నారు. పథకం ప్రకారమే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులు మురళి కృష్ణ గౌడ్ పై దాడి చేశారని మండిపడ్డారు. రాజకీయం కోసం మనుషులను చంపేస్తారా అని ప్రశ్నించారు. పైలెట్ రోహిత్ రెడ్డి కాదు.. గుండా రోహిత్ రెడ్డి అని విమర్శించారు. మురళీకృష్ణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మురళీకృష్ణకు ఆయన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.