భద్రాద్రికొత్తగూడెం/దమ్మపేట, వెలుగు: మీ ఇంట్లో ఏదైనా పరికరం పనిచేయకపోతే ఇలాగే వదిలేస్తారా అని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ వైద్యాధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలో గురువారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్వారిగూడెం పీహెచ్సీలో ఏడాదిగా పనిచేయని అనాలసిస్ మిషన్ను బాగు చేయకపోవడంపై మండిపడ్డారు. జిల్లాలోని హాస్పిటళ్లలోని పనిచేయని మిషన్లను పరిశీలించి వాటి రిపేర్లకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం మండలంలోని గండుగులపల్లి గ్రామంలో చేపడ్తున్న సోలార్పనులను పరిశీలించారు. గండుగులపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్గా రూపొందిస్తున్నామన్నారు. అనంతరం మదనపల్లి గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ బాయ్స్ గురుకులాన్ని సందర్శించారు. డిజిటల్ క్లాస్రూం, డైనింగ్హాల్, తరగతి గదులు అపరిశుభ్రతగా ఉండడంపై మండిపడ్డారు. మెనూ అమలు కాకపోవడంపై హెచ్ఎం, వార్డెన్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
