అటవీ సంపద, వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత : కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరావు

అటవీ సంపద, వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత : కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరావు

జూలూరుపాడు, వెలుగు : అటవీ సంపదను, వన్య ప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యతని కొత్తగూడెం ఎఫ్​డీఓ కోటేశ్వరావు అన్నారు. మంగళవారం మండలపరిధిలోని వినోభానగర్ గ్రామంలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధి విషయంపై ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎఫ్​డీఓ కోటేశ్వరావు మాట్లాడుతూ అడవుల అభివృద్ధి, సంరక్షణే ధ్యేయంగా కృషి చేస్తున్నామని, అటవీ సంపద, వనరులు, వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు.

 అడవుల్లో అడవి జంతువుల సంఖ్య పెరుగుతోందని రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జంతుగణన జనవరి నుంచి జరుగుతుందన్నారు. రానున్న వేసవికాలం లో అడవులలో  అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు తీసుకోవలసిన జాగ్రత్తల పై ప్రజలకు,విద్యార్దులకు  అవగాహన కల్పించారు. 

వాటి వల్ల  అడవిలోని జంతువులకు, ప్లాంటేషన్లకు నష్టం వాటిల్లి, అపారమైన అటవీ సంపదను కోల్పోవడం జరుగుతుందన్నారు. అడవిలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా గ్రామస్తులు సహకరించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్, ఎఫ్ఆర్వో ప్రసాదరావు, సిబ్బంది,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.