కొత్తగూడెంలోని రైస్​ గ్రాండ్​ రెస్టారెంట్ లో కుళ్లిన మాంసంతో బిర్యానీ

 కొత్తగూడెంలోని రైస్​ గ్రాండ్​ రెస్టారెంట్ లో కుళ్లిన మాంసంతో బిర్యానీ
  • 5 వేలు ఫైన్​విధించిన  మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని రైస్​ గ్రాండ్​ రెస్టారెంట్ లో కుళ్లిన మాంసంతో బిర్యానీలు చేస్తున్నారనే కంప్లైంట్‌తో తనిఖీలు చేసి రెస్టారెంట్‌కు రూ. 5 వేల జరిమానా విధించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు శనివారం తెలిపారు. మున్సిపల్ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం..  పట్టణంలోని రామవరం ప్రాంతానికి చెందిన ఓ యువతి రైస్​ గ్రాండ్​ రెస్టారెంట్‌లో బిర్యానీ తెచ్చుకుంది.  బిర్యాని నుంచి కుళ్లిన వాసన రావడంతో బాధితులు రెస్టారెంట్​ యజమానులను అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. 

 వారు ఇచ్చిన కంప్లైంట్​తో రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించగా కుళ్లిన మాంసంతో చేసినట్లు తేలడంతో  రూ. 5 వేలు ఫైన్​ వేసినట్టు పేర్కొన్నారు.  కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్న  రైస్​ గ్రాండ్​ రెస్టారెంట్​ను సీజ్​ చేయాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.