అమిత్ షాకు 27 ప్రశ్నలు సంధించిన కేటీఆర్
V6 Velugu Posted on May 14, 2022
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వార్ ఓ రేంజ్ లో నడుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వేసవిలో కూడా తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కించేలా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్న వేళ మంత్రి కేటీఆర్ ఆయనపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందంటూ అమిత్ షాకు 27 ప్రశ్నలు వేశారు.కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని టీఆర్ఎస్ కోరితే పట్టించుకోని బీజేపీ.. గుజరాత్లో మాత్రం రూ. 20 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం నిజం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదన్న మంత్రి.. గుజరాత్కు మాత్రం ఇవ్వని హామీలను అమలు చేశారన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఒక్కటంటే ఒక్క కేంద్రీయ విద్యాసంస్థనైనా ఏర్పాటు చేశారా? అని కేటీఆర్ బీజేపీని నిలదీశారు. బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా లోని తుక్కుగూడలో నిర్వహిస్తున్న బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా ఇవాళ హాజరుకానున్నారు.
తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS బహిరంగ లేఖ
— TRS Party (@trspartyonline) May 13, 2022
- తెలంగాణకు బీజేపీ చేస్తున్న అన్యాయాలపైన ప్రశ్నలు సంధించిన కేటీఆర్
- తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉంటే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మంత్రి సవాల్…https://t.co/Q6qkKcKmmy pic.twitter.com/fNkiDW1nsy
మరిన్ని వార్తల కోసం
రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయండి
గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం
Tagged Minister KTR, funds release, Amit sha, 27 Questions, Telengana Tour, Kazipet railway coach Factory