కాంగ్రెస్ కు చాన్సిస్తే అంధకారమే: కేటీఆర్

కాంగ్రెస్ కు చాన్సిస్తే అంధకారమే: కేటీఆర్
  • కాంగ్రెస్‌ హవా అనేది సోషల్​మీడియా ప్రచారం మాత్రమే

  • చౌటుప్పల్​రోడ్​షోలో మంత్రి కేటీఆర్​

యాదాద్రి: కాంగ్రెస్‌కు మళ్లీ చాన్సిస్తే తెలంగాణలో అంధకారమేనని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ రోడ్ షోలో నిర్వహించిన రోడ్​షోలో ఆయన మాట్లాడారు. ‘రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసిండో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. డబ్బు మదంతో అహంకార పూరితంగా  వ్యవహరిస్తున్నడు.

 బీజేపీ సిద్ధాంతాలను రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో అమలు చేస్తున్నరు. 3 గంటల కరెంట్‌ చాలని  అంటుండు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందో? లేదో? ప్రజలే చెప్పాలి. కాంగ్రెస్‌ హవా అనేది సోషల్​మీడియా ప్రచారం మాత్రమే. ఎన్నికల ఫలితాలు రాగానే జాబ్‌ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తం.  పీఎం కిసాన్‌కు లేని అడ్డంకి రైతుబంధుకు ఎందుకు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.