నాకు ప్రపంచం తెలియదని, ఇది నేను ఊహించనిదని, నాకు ఈ గుర్తింపు ఇంత గుర్తింపు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు కుమారి ఆంటీ. తాజాగా ఆమె హైదరాబాద్లో జరిగిన డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లను ప్రశంసించారు.
ఇందులో భాగంగా స్టేజిపైకి వచ్చిన కుమారి ఆంటీ తన మాటలతో గెస్ట్ లను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన భావోద్వేగమైన, అమాయకమైన మాటలతో ప్రేక్షకుల హృదయాలను తాకారు. ఈ గుర్తింపు నేను ఊహించనిది. ప్రపంచం అంటే ఏంటో నాకు తెలియదు. కానీ, నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది సోషల్ మీడియా. దానివల్లే నేను ఇక్కడ ఉన్నాను. అందుకు కారణమైన వారికి నా కృతజ్ఞతలు.
చేసే ప్రతీ పనిని ఆత్మవిశ్వాసంతో చేయండి. అదుంటే విజయమే. చదువు లేదని బాధపడొదద్దు.. భక్తి, ముక్తికి చదువులెందుకు. ఆత్మ శాంతి ఉంటే చాలు.. అదే దైవము. ఆత్మ విశ్వాసంతో పని చేసుకుంటూ ముందుకు వెళితే.. అంతా మంచే జరుగుతుందని మా పెద్దలు చెప్పారు. పెద్దల మాట వింటే.. ఇప్పటికే విజయమే. అది నా విషయంలో ప్రూవ్ అయ్యింది. కాబట్టి.. మీ అందరికి ఒకటే చెప్పగలను పెద్దల మాట వింటే.. విజయమే కానీ అపజయం ఉండదు.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు కుమారి ఆంటీ. దాంతో ఆమె మాట్లాడిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.