
- మంత్రి వివేక్ వెంకటస్వామికి కురుమ సంఘం ప్రెసిడెంట్ వినతి
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో గొర్లు, మేకల కాపరులపై ఫారెస్ట్ ఆఫీసర్లు వేధింపులకు పాల్పడుతున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని జిల్లా కురుమ సంఘం ప్రెసిడెంట్ గుంట శ్రీశైలం కోరారు. శనివారం హైదరాబాద్లో మంత్రిని పలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో గొర్లు, మేకలను మేపేందుకు కాపరులకు అడవిలోకి వెళ్లేందుకు పర్మిషన్ ఇప్పించాలని కోరారు.
అనుమతి లేకపోవడంతో ఫారెస్ట్ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని చెప్పారు. దీంతో స్పందించిన మంత్రి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ ఆఫీసర్లను ఫోన్లో ఆదేశించినట్లు శ్రీశైలం తెలిపారు. జిల్లాలో గొల్ల కురుమల భవనం నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు సీఎం దృష్టికి తీసుకవెళ్లాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు. మంత్రిని కలిసినవారిలో కాంగ్రెస్ లీడర్లు మంద తిరుమల్ రెడ్డి, వెల్ది సాయి తదితరులున్నారు.