కరెంట్​ షాక్ తో కూలీ మృతి

కరెంట్​ షాక్ తో కూలీ మృతి

శివ్వంపేట, వెలుగు: కరెంట్​ షాక్​తో కూలీ మృతి చెందిన ఘటన మెదక్​జిల్లా శివ్వంపేట మండలం మల్యా తండా శివారులోని ప్రొఫామ్  సీడ్ కంపెనీలోజరిగింది. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. చండి  గ్రామానికి చెందిన మల్లేశ్ (50) ప్రొఫామ్  సీడ్ కంపెనీలో ఏడాదిగా కూలీగా పనిచేస్తున్నాడు.  ఆదివారం ఉదయం సీడ్ కంపెనీ సూపర్​ వైజర్ నర్సింలు ఫోన్ చేసి కంపెనీలో మోటారు నడవడం లేదు వచ్చి చూడమని చెప్పడంతో వెళ్లాడు. కంపెనీలో ట్రాన్స్​ ఫార్మర్ బంద్​చేసే క్రమంలో​మల్లేశ్​కు​కరెంట్​షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.