కూలీని వరించిన అదృష్టం : మట్టి తీస్తుండగా వజ్రం దొరికింది

కూలీని వరించిన అదృష్టం : మట్టి తీస్తుండగా వజ్రం దొరికింది

మధ్యప్రదేశ్ : అదృష్టం బాగుంటే పొద్దున్నే నక్క తోక తొక్కాడేమో అంటాం. ఇప్పుడు మట్టి అమ్ముకునే ఓ కూలీని అలాంటి అదృష్టమే వరించింది. రూ.200 పెట్టుబడి పెట్టిన అతడికి ఒక్కరోజులోనే రూ.10 లక్షలు వచ్చాయి. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..అదే లక్కు అంటేమరి.

వివరాలు : పన్నా జిల్లా షాహ్ నగర్ కు చెందిన వసంత్ సింగ్ రూ.200 చెల్లించి64 మీటర్ల భూమిని 3 నెలల పాటు తవ్వకాలకు లీజుకు తీసుకున్నాడు. మర్నాడు ఆ భూమిలో తవ్వకాలు మొదలుపెట్టగా మెరుస్తున్న రాయి కన్పించింది. దీన్ని అధికారులకు చూపించగా..4.33 క్యెరెట్ల వజ్రమని, మార్కెట్లో దీని విలువ రూ.10 లక్షలు ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఆ వజ్రాన్ని వేలం వేసి..పన్నులు పోగా మిగిలినది కూలీకి ఇస్తామని తెలిపారు అదికారులు.