న్యూఢిల్లీ, వెలుగు: నాలుగేండ్ల కింద ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మంచి ఫలితాలు సాధిస్తూ, పచ్చదనం పెంపు దిశగా ముందుకు సాగుతోందని ఎంపీ జోగినిపల్లి సంతోశ్ అన్నారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతో దేశ ప్రజల్లో హరిత స్ఫూర్తిని నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) సహకారంతో ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చాలెంజ్గా తీసుకున్నామన్నారు. ఈ మేరకు బుధవారం నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నరైనా ఇండస్ట్రియల్ ఏరియా పార్క్లో వివిధ రాష్ట్రాల ఎంపీలతో కలిసి ఆయన మొక్కలు నాటారు. మియావాకీ పద్దతిలో పార్క్ ఖాళీ స్థలంలో వెయ్యి మొక్కలు నాటి, మినీ ఫారెస్ట్ను గ్రీన్ ఇండియా చాలెంజ్ డెవలప్ చేయనుంది. ఎంపీ సంతోశ్ తీసుకున్న చాలెంజ్ అందరికీ ఆదర్శవంతమైనదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభినందించారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా చేస్తున్న ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ ఆకాంక్షించారు. ఢిల్లీ లాంటి ప్రాంతంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అత్యంత అవసరమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఒక పార్కు ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని రామ్ కీ సంస్థ చైర్మన్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు.
ఢిల్లీలో లక్ష మొక్కలు నాటుతం
- తెలంగాణం
- February 10, 2022
లేటెస్ట్
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన