సభ సక్సెస్ ను జీర్ణించుకుంటలేరు : లక్ష్మారెడ్డి

సభ సక్సెస్ ను జీర్ణించుకుంటలేరు : లక్ష్మారెడ్డి

జడ్చర్ల, వెలుగు: పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సక్సెస్​ చేయడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే ఇంట్లో మీడియాతో మాట్లాడారు. 50 ఏండ్లుగా చేయని అభివృద్ధిని, పదేండ్లలో చేసి చూపించానని తెలిపారు. కాంగ్రెస్  హయాంలో జడ్చర్లలో ఏదో ఒక సమస్యపై వార్తలు వచ్చేవని చెప్పారు.

పట్టణంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని, కొన్ని చోట్ల చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. జడ్పీ వైస్ చైర్మన్  కొడుగల్  యాదయ్య, మున్సిపల్ చైర్​పర్సన్  ధోరేపల్లి లక్ష్మి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, పిట్టల మురళి, రాంమోహన్, కౌన్సిలర్లు ఉమా శంకర్ గౌడ్, చైతన్య చౌహాన్, కోట్ల ప్రశాంత్ రెడ్డి, రమేశ్​ పాల్గొన్నారు.