తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్​దే అధికారం : లక్ష్మారెడ్డి

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్​దే అధికారం : లక్ష్మారెడ్డి

జడ్చర్ల, వెలుగు: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్​కు మద్దతుగా నిలుస్తారని, డిసెంబర్​ 3 తర్వాత కేసీఆర్  సీఎం పదవి చేపట్టి హ్యాట్రిక్​ కొడతారని జడ్చర్ల బీఆర్ఎస్​ అభ్యర్థి, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జడ్చర్ల మండలంలోని కుర్వగడ్డపల్లి, అల్వాన్​పల్లి, పెద్దపల్లి, చర్లపల్లి, గోప్లాపూర్​ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు.

ప్రచారానికి వెళ్లిన తమకు ఓటర్లే ఎదురొచ్చి ఆశీర్వదించడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. కాగా, లక్ష్మారెడ్డి కుమారుడు స్వరణ్​రెడ్డి మిడ్జిల్ మండలంలోని దోనూర్, వెలుగోముల గ్రామాల్లో, కూతరు స్ఫూర్తి రెడ్డి జడ్చర్ల మున్సిపాల్టీలోని 7వ వార్డులో మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్  బాద్మి శివకుమార్, పిట్టల మురళి, కోడ్గల్ యాదయ్య, ఇమ్ము, శ్రీకాంత్, గోవర్ధన్​రెడ్డి, రాములు పాల్గొన్నారు.