
టోక్యో: కెనడా ఓపెన్ నెగ్గి జోరు మీదున్న ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మరో టైటిల్కు రెండడుగుల దూరంలోనే నిలిచిపోయాడు. జపాన్ ఓపెన్ సూపర్750 టోర్నమెంట్లో అతని సూపర్ పెర్ఫామెన్స్కు సెమీఫైనల్లో బ్రేక్ పడింది.
దాంతో ఈ టోర్నీలో ఇండియా పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో 21 ఏండ్ల లక్ష్యసేన్ 15–21, 21–13, 16–21తో వరల్డ్ 9వ ర్యాంకర్, ఆసియా గేమ్స్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీ చేతిలో మూడు గేమ్స్ పాటు పోరాడి ఓడిపోయాడు.
ఇది వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో చెరోటి నెగ్గిన సేన్, క్రిస్టీ ఈ పోరులో 68 నిమిషాల పాటు హోరాహోరీగా తలపడ్డారు. బలమైన డిఫెన్స్ చూపెట్టిన ఐదో సీడ్ క్రిస్టీ లాంగ్ ర్యాలీల్లో సత్తా చాటి సేన్ను ఓడించాడు.