- ఆర్వోఆర్, 1బీ, పహాణీ, పెండింగ్సర్వే నంబర్లు,అమెండ్మెంట్ రిజిస్టర్ తొలగింపు
- ధరణి పోర్టల్లోనూ కనిపించని ఈ రికార్డులు సర్కారు తీరుపై అనుమానాలు
హైదరాబాద్, వెలుగు: సీసీఎల్ఏ వెబ్ సైట్ లో వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక సమాచారం మాయమైంది. ఇటీవల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు ధరణి పోర్టల్ ను ప్రారంభించిన ప్రభుత్వం.. సీసీఎల్ఏ వెబ్ సైట్ లో ఇన్నాళ్లూ ప్రజలకు కనిపించిన భూముల సమగ్ర వివరాలను హఠాత్తుగా తీసేసింది. సీసీఎల్ఏ వెబ్ సైట్ఓపెన్ చేయగానే ‘నో యువర్ ల్యాండ్ స్టేటస్’ అనే ఆప్షన్ లో కనిపించే 1బీ, పహాణీ, పెండిగ్సర్వే నంబర్లు, అమెండ్మెంట్రిజిస్టర్ ప్రస్తుతం కనిపించట్లేదు. ఇన్నాళ్లూ పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఈ వివరాలను తొలగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్ పరెన్సీ గురించి పదేపదే చెప్పే సర్కారు.. అందరికీ అందుబాటులో ఉన్న పాత రికార్డులను తొలగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏడింటిలో రెండు విభాగాలు తొలగింపు
సీసీఎల్ఏ వెబ్ సైట్ లోని నో యువర్ ల్యాండ్స్టేటస్ఆప్షన్ పై క్లిక్చేస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్), భూముల నక్షలు(కాడస్ట్రల్ మ్యాప్స్), రిజిస్ట్రేషన్డీడ్స్, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్పేమెంట్ వివరాలు, రెవెన్యూ కోర్టు కేసుల డేటా, సివిల్ కోర్టు కేసుల డేటా, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్సెర్చ్(సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు) లాంటి ఏడు విభాగాలు కనిపించేవి. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఎక్కడి నుంచైనా ఈ సమాచారం యాక్సె్స్ లో ఉండేది. అయితే ఈ ఏడింటిలో వ్యవసాయ భూములకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచిన రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్), ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సెర్చ్ విభాగాలను ప్రభుత్వం తొలగించింది. దీంతో రెవెన్యూ రికార్డుల్లో కీలకమైన ఆర్వోఆర్అండ్ 1బీ, పహణీ, అమెండ్మెంట్రిజిస్టర్ సీసీఎల్ఏ వెబ్ సైట్ లో కనిపించడం లేదు.
పెండింగ్ సర్వే నంబర్ల తొలగింపు
భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలో ఎలాంటి వివాదాలు లేని 1.55 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు రాష్ట్ర ప్రభుత్వం 60,95,134 పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసింది. ఇవి కాకుండా భూమి ఓనర్ షిప్ విషయంలో ఏదైనా వివాదం ఉంటే పార్ట్ బీలో చేర్చి ఆ సర్వే నంబర్లను పెండింగ్లో పెట్టారు. ఇలాంటి సర్వే నంబర్లన్నీ గ్రామాలవారీగా సీసీఎల్ఏ వెబ్ సైట్ లోని సర్వే నంబర్పెండింగ్ఫర్ క్లియరెన్స్ కేటగిరీలో కనిపించేవి. ప్రస్తుతం ఈ కేటగిరీ కూడా కనిపించడం లేదు. దీంతో గ్రామాలవారీగా పాస్ పుస్తకాలు జారీ కాని సర్వే నంబర్లను తెలుసుకునే చాన్స్లేకుండా పోయింది. పెండింగ్సర్వే నంబర్లు గ్రామానికి 200 నుంచి 500 చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల వరకు ఉంటాయని అంచనా.
ధరణి కంటే సీసీఎల్ఏ వెబ్ సైట్ బెటర్
సీసీఎల్ఏ వెబ్ సైట్ తో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో భూముల సమాచారం అరకొరగానే ఉంది. కేవలం పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన భూముల సమాచారాన్నే అందుబాటులో ఉంచారు. ల్యాండ్డిటైల్స్సెర్చ్లో వివరాలు ఎంటర్ చేస్తే కేవలం పట్టాదారు పేరు, తండ్రి పేరు, భూమి విస్తీర్ణం, మార్కెట్ వ్యాల్యూ మాత్రమే వస్తున్నాయి. ఎన్కంబ్రెన్స్డిటైల్స్అనే ఆప్షన్ పై క్లిక్చేస్తే ఏ సమాచారం రావడం లేదు. ధరణి కంటే సీసీఎల్ఏ వెబ్ సైట్ లోనే వివరాలు సమగ్రంగా ఉండేవని.. పబ్లిక్ డొమైన్ నుంచి ఈ సమాచారాన్ని తొలగించడాన్ని రెవెన్యూ ఉద్యోగులు, భూచట్టాల నిపుణులు తప్పుబడుతున్నారు. ఒకే రికార్డు పేరిట భూములకు సంబంధించినపాత రికార్డులన్నింటినీ మాయం చేసే కుట్ర కనిపిస్తోందని ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు.
భూమి వివరాలెట్ల తెలుసుకోవాలి?
వన్ బీ రికార్డులో సర్వే నంబర్, మొత్తం భూమి విస్తీర్ణం, సాగుకు పనికొచ్చే భూమి, యజమాని పేరు, భూమి స్వభావం, భూమి సంక్రమించిన విధానం మొదలైన వివరాలు ఉంటాయి. పహాణీలో 1 బీ వివరాలతోపాటు జలాధారం, ఖాతా నంబర్, ఆధార్సీడింగ్, డిజిటల్ సైన్వివరాలు ఉంటాయి. అమెం డ్మెంట్ రిజిస్టర్ లో సర్వే నంబర్, భూమి విస్తీర్ణం, విక్రయదారు పేరు, కొనుగోలుదారు పేరు, మ్యుటేషన్ చేసిన తేదీ, తహసీల్దార్ డిజిటల్సైన్చేసిన తేదీ ఉంటాయి. ఈ అమెండ్మెంట్ రిజిస్టర్ద్వారా భూమి ఎవరి నుంచి ఎవరికొచ్చింది? ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? అనే వివరాలు ప్రజలె వరైనా తెలుసుకునే వీలుండేది. అయితే ఇప్పుడు ఆ చాన్స్ లేకుండా పోయింది.