దేశంలో 168.98 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ 

దేశంలో 168.98 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ 

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 168.98 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటన లో తెలిపింది. గడిచిన 24గంటల్లో 47 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపింది. దేశంలో రికరీ రేట్ 95.64 శాతం కాగా 24 గంటల్లో 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 13,31,648 కాగా.. వీక్లీ పాజిటివిటీ రేట్ 11.21 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.  దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పెద్దఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందన్నారు. 

మరిన్ని వార్తల కోసం

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమే

గురుకులాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి