- ప్రపంచంలోనే పెద్ద ఆర్ఈ స్టోరేజ్
- ప్లాంట్ పెడుతున్న గ్రీన్కో
- కర్నూల్ వద్ద 23,246 కోట్లతో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: రెన్యువబుల్ ఎనర్జీ రంగంలోని గ్రీన్కో ఆంధ్ర ప్రదేశ్లోని కర్నూల్ వద్ద అతి పెద్ద స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. రూ. 23,246 కోట్ల (మూడు బిలియన్ డాలర్ల) ఖర్చుతో ఈ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ను పెడుతున్నట్లు గ్రీన్కో జాయింట్ ఎండీ మహేష్ కొల్లి వెల్లడించారు. 5,230 మెగావాట్ల సామర్ధ్యముండే స్టోరేజ్ ప్లాంట్ ప్రాజెక్టులో 1000 మెగావాట్లకు సరిపడేలా ఆర్సిలర్ మిట్టల్ 600 మిలియన్ డాలర్లు వెచ్చిస్తోందని చెప్పారు. కర్నూల్ వద్ద ఈ ప్రాజెక్టుకు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. 2023 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ కొత్త ప్రాజెక్టుతో స్టోరేజ్లో తాము ముందడుగు వేసినట్లవుతుందని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఇది సాధ్యమైందని గ్రీన్కో గ్రూప్ సీఈఓ అనిల్ చలమలశెట్టి చెప్పారు.