- తమ పిల్లలు ఇబ్బందులు పెట్టినట్టు అధికారులకు ఫిర్యాదులు
- 122 కేసులు పరిష్కరించగా.. ప్రాసెస్లో మరో 37
- సీనియర్ సిటిజన్స్ కు అండగా రక్షణ చట్టాలు
హైదరాబాద్, వెలుగు: ‘‘ సిటీకి చెందిన 75 ఏండ్ల ఓ వృద్ధురాలికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. తన పేరు మీద 150 గజాల స్థలం ఉండగా.. అది అమ్మి శివారులో ఓ ఇల్లు కొనుక్కొందామని ఆమె నిర్ణయించుకుంది. కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యక్తి రూ. 10 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాడు. తన చిన్న కొడుకు బెదిరించి ఆస్తిని తన పేరిట గిఫ్ట్ డీడ్గా రాయించుకుని.. ఆపై ఇంట్లో బంధించాడు. పెద్ద కొడుకు , అడ్వాన్స్ డబ్బులు ఇచ్చిన వ్యక్తితో కలిసి హైదరాబాద్ కలెక్టర్కు కంప్లయింట్ చేశారు. విచారణ చేపట్టిన కలెక్టర్ వృద్ధురాలితో మాట్లాడి గిఫ్ట్ డీడ్క్యాన్సిల్ చేయించారు.’’
“సిటీకి చెందిన 70 ఏండ్ల ఓ వృద్ధుడికి రెండు అంతస్తుల ఇల్లు ఉంది. అతని కొడుకు ఫారెన్ లో సెటిల్ అయ్యాడు. ఇంటిని ఓ అడ్వకేట్కు రెంట్ కు ఇచ్చిన వృద్ధుడు తను సిటీలోనే ఉండే కూతురు వద్ద ఉంటున్నాడు. కరోనా టైమ్ నుంచి అడ్వకేట్ ఇంటి అద్దె, కరెంట్, వాటర్ బిల్లులుచెల్లించడం లేదు. ఇదేంటని వృద్ధుడు అడగ్గా ‘నేను అడ్వకేట్ను. ఏం చేస్తావో చేస్కో’ అంటూ బెదిరించేవాడు. దీంతో వృద్ధుడు హైదరాబాద్కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. అడ్వకేట్ను కలెక్టర్ పిలిపించి విచారించారు. ఎలాంటి ఫ్రూప్స్ చూపకపోవడంతో నెల తర్వాత ఆర్డీవో, తహశీల్దార్ దగ్గరుండి అడ్వకేట్ను ఇల్లు ఖాళీ చేయించారు.’’
పిల్లలను కని, పెంచి, పెద్దచేశాక వృద్ధ తల్లిదండ్రుల బాధ్యతలను పట్టించుకోని, చీదరించుకునే ఘటనలు చూస్తూనే ఉంటాం. అంతేకాదు వృద్ధ తల్లిదండ్రులను మానసికంగా, శారీరకంగా వేధించడం, వారి ఆస్తులను బలవంతంగా పిల్లలు తమ పేరుమీద రాయించుకోవడం.. ఆపై ఇంట్లోంచి వెళ్లగొట్టడం, లేదంటే ఓల్డేజ్హోమ్ ల్లో చేర్పించడం.. వంటివి కూడా కన్పిస్తుంటాయి. అయితే.. పిల్లల వేధింపులు భరించలేని వృద్ధ తల్లిదండ్రులు కొందరు అధికారులకు కంప్లయింట్ చేస్తుండగా.. మరికొందరు చెప్పుకోలేక మౌనంగా భరిస్తుంటారు. కాగా.. వృద్ధుల వేధింపులపై గతేడాది నుంచి ఇప్పటివరకు హైదరాబాద్జిల్లాలో మొత్తం176 కేసులు నమోదు అయ్యాయి. దీంతో వీటిపై జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులకు, ప్రజావాణిలో సీనియర్ సిటిజన్స్నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో సీనియర్ సిటిజన్స్కేసుల హియరింగ్స్కోసం స్పెషల్ టైమ్ కూడా కేటాయిస్తున్నారు. మెయింటెనెన్స్అండ్వెల్ఫేర్ఆఫ్పేరెంట్స్అండ్సీనియర్సిటిజన్స్యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో వృద్ధ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవట్లేదనే కంప్లయింట్లు మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్జిల్లాలోనే ఎక్కువగా వస్తున్నాయని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. 2023 నుంచి ఇప్పటివరకు మొత్తం 176 సీనియర్ సిటీజన్స్కంప్లైంట్స్ వచ్చాయి. వీటిలో కొడుకులు, కూతుర్లు, కోడళ్లు, సంరక్షకులు వృద్ధులను పట్టించుకోకపోవడం, ఇండ్లల్లోంచి వెళ్లగొట్టడం, శారీరకంగా హింసించడం, మానసిక, ఆర్థిక, ఆస్తి సంబంధిత వేధింపులు అధికంగా ఉంటున్నాయి. వచ్చిన కంప్లయింట్లలో అధికారులు 122 పరిష్కరించారు.
రక్షణగా ఎమ్డబ్ల్యూపీఎస్సీ యాక్ట్
పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను విస్మరిస్తే కఠిన చట్టాల ద్వారా శిక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మెయింటనెన్స్ అండ్వెల్ఫేర్ఆఫ్పేరెంట్స్అండ్సీనియర్ సిటిజన్స్యాక్ట్ – 2011కు, 2022 లో కీలక సవరణలు చేశారు. దీని ప్రకారం.. ఆస్తులను గిఫ్ట్ డీడ్ కింద పిల్లలకు లేదా సంరక్షకులకు ఇచ్చినప్పుడు ఆ వృద్ధులను సరిగ్గా చూసుకోకపోతే.. ఆ గిఫ్ట్ డీడ్ను క్యాన్సిల్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్ఆస్తులను అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నా.. రద్దు చేసే అధికారాలు కలెక్టర్కు ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా హింసిస్తే ఎమ్డబ్ల్యూపీఎస్సీ యాక్ట్ ద్వారా ఇంట్లోంచి బయటకు పంపడం, ప్రొటెక్షన్ఆఫ్లైఫ్అండ్ ప్రాపర్టీ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ కింద పరిగణించి సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం 3 నెలల జైలు శిక్షా, 5 వేల ఫైన్విధిస్తారు.