కాంగ్రెస్ ఫ్లెక్సీల చించివేత.. పోలీసులకు నేతల ఫిర్యాదు

కాంగ్రెస్ ఫ్లెక్సీల చించివేత.. పోలీసులకు నేతల ఫిర్యాదు

కడెం, వెలుగు: కడెం మండలం పెద్దూర్ గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ధ్వంసం చేసి, వాటిపై పేడ కొట్టారు. విషయం తెలుసుకున్న పార్టీ మండల నాయకులు కడెం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఈ చర్యకు పాల్పడివారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్​ చేశారు. వారి ఫిర్యాదు  మేరకు ఎస్సై కోసన రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.