వెంకన్నను దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

వెంకన్నను దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

తిరుమల: కొత్త ఏడాది సందర్భంగా పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు సాయికుమార్, దర్శకుడు  అనిల్ రావిపూడి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖ హిందీ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా తిరుమలకు వచ్చారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆమె వెంకన్నను దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు కంగనాకు ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ కాళహస్తి ఆలయాన్ని కూడా కంగన దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, గుజరాత్ మంత్రి జితేంద్ర చౌదరి సహా పలువురు వెంకన్నను దర్శించుకున్నారు. 

ఇకపోతే, తిరుమలలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. రాత్రి 12 గంటల సమయానికి చలిని లెక్క చేయకుండా భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి ఆలయం ముందుకు చేరారు. గోవింద నామస్మరణ చేస్తూ కొత్తేడాదికి ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండేలా చూడాలంటూ శ్రీవారిని వేడుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని ప్రార్థించారు.

మరిన్ని వార్తల కోసం: 

ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు షాక్!

దొంగ అని పొరబడి.. కూతురిని కాల్చేసిండు

జీవో 317ను సవరించాలె