దొంగ అని పొరబడి.. కూతురిని కాల్చేసిండు

దొంగ అని పొరబడి.. కూతురిని కాల్చేసిండు

వాషింగ్టన్: రాత్రిపూట అలారం మోగడంతో ఇంట్లోకి దొంగ చొరబడ్డడని అనుకున్నడు.. గరాజ్​లో కదలికలు గుర్తించి తుపాకీతో కాల్చిండు. ఆపై దగ్గరికి వెళ్లి చూసి గుండెలవిసేలా ఏడ్చిండు. చీకట్లో దొంగ అని పొరబడి కన్న కూతురినే కాల్చి చంపుకున్నడా తండ్రి! అమెరికాలోని ఓహియో​లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆ తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న కూతురు హెయిర్​స్టన్​ను కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఉపయోగంలేకుండా పోయింది. తమ కూతురు ప్రాణాపాయంలో ఉందంటూ ఉదయం 4.30 గంటలకు ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్​కు పేరెంట్స్ కాల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, హెయిర్​స్టన్​ను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటూ ఒక గంటలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.