పిల్లలకు జన్మనిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయిన చిరుతపులి

పిల్లలకు జన్మనిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయిన చిరుతపులి
  • వదిలివెళ్లిన చిరుత పులి
  • ఉత్తరాఖండ్​ గ్రామంలో టెన్షన్​

పితోర్‌‌గఢ్: ఓ చిరుతపులి మూడు పిల్లలకు జన్మనిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఉత్తరాఖండ్​ రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.  పితోర్​గఢ్​కు దగ్గర్లోని  సిల్పటా గ్రామంలో పాడుబడిన బిల్డింగ్​లో చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది.  ఆ బిల్డింగ్​లో పశువుల మేతను నిల్వ ఉంచుతారు. సోమవారం ఉదయం గీతా దేవి అనే మహిళ మేతను తీసుకెళ్లడానికి వెళ్లి చిరుత పిల్లలను గుర్తించింది. అయితే, చిరుతపులి వాటికి దగ్గరలో ఉండొచ్చని ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటకు పరుగుతీసి గ్రామస్తులకు విషయం చెప్పింది.

వారు ఫారెస్ట్​ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పితోర్‌‌గఢ్ ఫారెస్ట్ డివిజన్ రేంజ్ ఆఫీసర్ దినేష్ జోషి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.  పులి మళ్లీ తన పిల్లల వద్దకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పులి దాడి నుంచి గ్రామస్తులను రక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.