పాక్ త్వరలో ముక్కలైతది.. లడఖ్‌‌‌‌ ఎల్జీ కవిందర్‌‌‌‌‌‌‌‌ గుప్తా హెచ్చరిక

పాక్ త్వరలో ముక్కలైతది.. లడఖ్‌‌‌‌ ఎల్జీ కవిందర్‌‌‌‌‌‌‌‌ గుప్తా హెచ్చరిక

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌‌‌‌ ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌‌‌‌‌(పీవోకే) లోని షాక్స్‌‌‌‌గాం వ్యాలీలో చైనా చేపట్టిన నిర్మాణ పనులను వెంటనే ఆపాలని లడఖ్‌‌‌‌ ఎల్జీ కవిందర్‌‌‌‌‌‌‌‌ గుప్తా డిమాండ్‌‌‌‌ చేశా రు. ఆ ప్రాంతం ఎప్పటికీ భారత్‌‌‌‌లో భాగమేనని అన్నారు. 

పీవోకే ప్రజలు కూడా భారత్‌‌‌‌లో కలవాలని కోరుకుంటున్నారని చెప్పారు. పాకిస్తాన్‌‌‌‌ త్వరలో ముక్కలవుతుందని ఆయన హెచ్చరించారు. ‘‘పాక్​ ఆక్రమించిన షాక్స్‌‌‌‌గాం లోయ ప్రాంతం భారత్‌‌‌‌లో భాగమేనని 1994లో ఇండియన్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ తీర్మానం చేసింది. ప్రస్తుతం పీవోకే ప్రజలు భారత్‌‌‌‌లో కలవాలని కోరుకుంటున్నారు. కాబట్టి, త్వరలోనే పాకిస్తాన్‌‌‌‌ ముక్కలవడం ఖాయం” అని గుప్తా చెప్పారు.