
తిరుపతి: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో కొత్త మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.5,001 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
ఈ ప్లాంట్ గ్రౌండ్ బ్రేకింగ్ సెర్మనీ మే 8న జరుగుతుంది. రెండేండ్లలో అందుబాటులోకి వస్తుందని అంచనా. ప్రస్తుతం పూణే, నోయిడాలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు నడుపుతున్న ఎల్జీ, భారత్లో తమ మూడో ప్లాంట్ను శ్రీ సిటీలో నెలకొల్పుతోంది.