హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పాలసీ హోల్డర్లకు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ను మరింత ఈజీ చేస్తున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) వెల్లడించింది. కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొంది. డెత్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ను వేగంగా ముగించేందుకు ఎల్ఐసీ కొన్ని చర్యలను ప్రకటించింది. మరణం హాస్పిటల్లో చోటు చేసుకున్నప్పటికీ, మున్సిపాలిటీ నుంచి డెత్ సర్టిఫికెట్కు బదులుగా ఇతర రుజువులు (ప్రూఫ్ ఆఫ్ డెత్) కూడా అంగీకరించనున్నట్లు వెల్లడించింది. డెత్ సర్టిఫికెట్, డిశ్చార్జ్ సమ్మరీ, గవర్నమెంట్, ఈఎస్ఐ, కార్పొరేట్ హాస్పిటల్స్ జారీ చేసిన డెత్ సమరీ (డేట్, టైము సహా) సరిపోతాయని, కాకపోతే వాటిపై ఎల్ఐసీ క్లాస్ 1 ఆఫీసర్లు లేదా డెవలప్మెంట్ ఆఫీసర్లు కౌంటర్ సిగ్నేచర్ చేయాలని ఎల్ఐసీ తెలిపింది.
దీంతోపాటు, క్రెమేషన్, బరియల్ సర్టిఫికెట్ లేదా సంబంధిత అధికారుల నుంచి దానిని రుజువు చేసే రశీదు ఉండాలని పేర్కొంది. మిగిలిన కేసులకు మాత్రం గతంలోలాగే మున్సిపల్ డెత్ సర్టిఫికెట్ అవసరమని వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ 31 దాకా యాన్యుయిటీస్ రిటర్న్స్ కోసం లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదని ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఈ–మెయిల్ ద్వారా పంపే లైఫ్ సర్టిఫికెట్స్ను కూడా తీసుకుంటామని పేర్కొంది. లైఫ్ సర్టిఫికెట్ ప్రొక్యూర్మెంట్ కోసం వీడియో కాల్ ప్రాసెస్ కూడా తెచ్చామని వివరించింది. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సర్వీసింగ్ బ్రాంచ్లోనే కాకుండా, తమకు దగ్గర్లోని ఏ బ్రాంచ్లోనైనా ఇచ్చే వెసులుబాటు కస్టమర్లకు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.