హైదరాబాద్: దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ లోని సైఫాబాద్ లో ఎల్.ఐ.సి ఆఫీసు ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దేశ వ్యాప్తంగా రెండు రోజులపాటు సార్వత్రిక సమ్మె నిర్వహిస్తుండటంతో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. బడ్జెట్ సమావేశాల్లో ఎల్ఐసీనీ పబ్లిక్ ఇష్యూకు పంపిస్తామని కేంద్రం ప్రకటించడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు. ఎల్ఐసి జోనల్ కార్యాలయం ఎదుట ర్యాలీ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు
చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు