
కర్ణాటకలో సాంప్రదాయ క్రీడల ఫెస్టివల్ జరుగుతోంది. కేసర్డ్ ఓంజి దిన పేరుతో ప్రతీ ఏడాది లాగానే ఈ సారి కూడా కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కేసర్డ్ ఓంజి దిన.. అంటే.. బురదనీటిలో ఒకరోజు గడపటం. పిల్లలు, పెద్దవాళ్లు.. ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బురదలోనే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు.