రేపే లోక్ సభ ఆరో విడత పోలింగ్

రేపే లోక్ సభ ఆరో విడత పోలింగ్

లోక్ సభ ఎన్నికలకు ఆరో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది. ఏడు రాష్ట్రాల్లో  మొత్తం 59 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరో విడతలో బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ,హర్యానా, ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు త్రిపురలో వెస్ట్‌ త్రిపుర నియోజకవర్గంలో 168 పోలింగ్‌  బూతుల్లో  రీపోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జార్ఖండ్, బీహార్ లోని కొన్ని  సమస్యాత్మక  ప్రాంతాల్లో  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.