అనిల్ అంబానీకి వ్యతిరేకంగా లుకౌట్ నోటీస్

అనిల్ అంబానీకి వ్యతిరేకంగా  లుకౌట్ నోటీస్

న్యూఢిల్లీ: మూడు కోట్ల రూపాయల లోన్ ​ఫ్రాడ్  కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి వ్యతిరేకంగా లుకౌట్ నోటీస్ జారీ అయింది.    బ్యాంకుల రిక్వెస్ట్​ మేరకు దీనిని జారీ చేశారు. యెస్ బ్యాంక్ ప్రమోటర్లతో  కుమ్మక్కై  అంబానీ గ్రూప్ కంపెనీలు ఈ లోన్​ను తీసుకున్నాయని, తిరిగి కట్టలేదని ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో అంబానీకి సమన్లు జారీ చేశామని తెలిపింది. ఈ నెల ఐదున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆర్థిక మోసాలు, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ నోటీసు కారణంగా అంబానీ విదేశాలకు వెళ్లడానికి వీలు ఉండదు. 

అక్రమంగా నిధులను  మళ్లించలేదు: ఆర్‌‌ ఇన్‌‌‌‌ఫ్రా 

తమ కంపెనీ నిధులను అక్రమంగా మళ్లించినట్టు వచ్చిన ఆరోపణలను రిలయన్స్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఖండించింది. అనిల్ అంబానీ మూడు సంవత్సరాలకు పైగా, అంటే మార్చి 2022 నుంచి కంపెనీ బోర్డులోనే లేరని స్పష్టం చేసింది. సెబీ రిపోర్ట్​లో పేర్కొన్నట్లుగా నిధుల మళ్లింపు రూ.10 వేలు కోట్లు కాదని, రూ.6,500 కోట్లు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఈ మొత్తాన్ని తిరిగి పొందడానికి సెటిల్‌‌‌‌మెంట్ కుదిరిందని పేర్కొంది.   సీఎల్​ఈ అనే కంపెనీ  'రిలేటెడ్​ పార్టీ' అని చెప్పకుండా దాని ద్వారా నిధులు మళ్లించారని సెబీ ఆరోపించింది.  రిలయన్స్ ఇన్‌‌‌‌ఫ్రా ఈ విషయాన్ని ఫిబ్రవరి 9న బహిరంగంగా వెల్లడించిందని,  ఇది సెబీ కనిపెట్టిన విషయం కాదని కంపెనీ వర్గాలు తెలిపాయి.