ఝార్ఖండ్: లారీ, కారు ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం ఝార్ఖండ్ లోని రామ్గఢ్ జిల్లాలో శనివారం జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. NH-33పై ఎదురెదురుగా వస్తున్న ఓ లారీ, కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. కారు ఔరంగాబాద్(బిహార్) నుంచి రాంచీకి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని సమాచారం. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కారు డ్రైవర్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్ట్ మార్టం కోసం మృతుల్ని స్థానిక హస్పిటల్ కి తరలించారు.