
లక్నోతో జరుగుతోన్న మ్యాచ్ లో బెంగళూరు బోల్తాపడింది. లక్నో బౌలర్ల దాటికి తక్కువ స్కోరుకే పరిమితమయ్యింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ 31, డుప్లెసిస్ 44,దినేశ్ కార్తీక్ 16 పరుగులు మినహా మిగతా వారంత సింగిల్ డిజిట్ కే పరిమితమమయ్యారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, రవి బిష్ణోయ్ ,అమిత్ మిశ్రాలకు చెరో రెండు వికెట్లు పడ్డాయి.కృష్ణప్ప గౌతమ్ కు ఒక వికెట్ పడింది.
127 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఒపెనర్ కెయిల్ మేయర్స్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఒక ఓవర్ ముగిసే సరికి లక్నో ఒక వికెట్ కోల్పోయి ఒక పరుగు మాత్రమే చేసింది.