జైపూర్ లో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ కు 155 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది లక్నో సూపర్ జాయింట్. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నోకు మంచి ఓపెనింగ్ లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 39 పరుగులు చేశాడు. కైల్ మేయర్స్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 42 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టుకు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. మార్కస్ స్టోయినిస్ 16 బంతుల్లో 21 , నికోలస్ పురాన్ 20 బంతుల్లో 28 పరుగులు మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు.
రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్ర అశ్విన్ రెండు, జోసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్ , సందీప్ శర్మలకు తలో ఒక వికెట్ పడ్డాయి.