
ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు స్టార్ట్ అయ్యింది. పాయింట్ల టేబుల్లో టాప్ 2 ప్లేసులో ఉన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్ మధ్య జైపూర్ లో మ్యాచ్ ప్రారంభమయ్యింది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ కు దిగిన లఖ్నో సూపర్ జాయింట్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ నిలకడగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి లక్నో 31 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ 14, కైల్ 15 పరుగులతో ఉన్నారు.
ట్రెంట్ బౌలింగ్ వేసిన ఫస్ట్ ఓవర్లో ఒక్క పరుగు చేయకపోవడం విశేషం. సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. మూడో బాల్ నో బాల్ వేయడంతో ఫ్రీ హిట్ వచ్చింది. అయినా ఒక్క పరుగులు రాబట్టలేదు.