కరోనాతో ఏసీపీ మృతి.. భార్య, మ‌రో ముగ్గురు పోలీసులకూ వైరస్​

కరోనాతో ఏసీపీ మృతి.. భార్య, మ‌రో ముగ్గురు పోలీసులకూ వైరస్​

లూథియానా​: కరోనాతో పంజాబ్​లోని లూథియానా ఏసీపీ అనిల్​ కోహ్లీ శనివారం మృతి చెందారు. దీంతో ఆయన ఫ్యామిలీ మెంబర్స్​తోపాటు పలువురు పోలీసులను అధికారులు క్వారంటైన్​కు తరలించి టెస్టులు చేస్తున్నారు. లూథియానాలో అసిస్టెంట్ కమిషనరల్​ ఆఫ్​పోలీస్ (ఏసీపీ)​గా పనిచేస్తున్న అనిల్​ కోహ్లీకి ఏప్రిల్​ 13న కరోనా పాజిటివ్​ కన్ఫామ్​ అయింది. దీంతో ఆయన స్థానిక ఎస్​పీఎస్​ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకున్నారు. రోజురోజుకు ఏసీపీ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో శనివారం ఆయనకు ప్లాస్మా థెరపి చేయాలని నిర్ణయించారు. ఇంతలోనే ఆయన ఆర్గాన్స్​ ఒక్కొక్కటిగా ఫెయిల్యూర్​ అయ్యాయి. దీంతో ఆయన శనివారం మృతి చెందారు. ఏసీపీ అనిల్​కోహ్లీ లూథియానాలోని మెయిన్​ వెజిటేబుల్​మార్కెట్​లో డ్యూటీ చేసేవారు. ఏసీపీ ద్వారా అతడి భార్య, డ్రైవర్​, ఎస్​హెచ్​ఓ, ఏఎస్​ఐకి కూడా కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. చురుగ్గా పనిచేసే ఓ అధికారిని డిపార్ట్​మెంట్ కోల్పోయిందని పోలీస్​ కమిషనర్​ రాకేశ్​ అగర్వాల్​ అన్నారు.