వాషింగ్టన్: వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో 2025 నోబెల్ శాంతి బహుమతిని గెల్చుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డును ఆమె అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అంకితం చేశారు. ఈ క్రమంలో వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళ్తోన్న మచాడో నోబెల్ బహుమతిని ట్రంప్కి ఇచ్చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై నార్వేజియన్ నోబెల్ కమిటీ రియాక్ట్ అయ్యింది.
నోబెల్ బహుమతిని ఇతరులతో పంచుకోవడం, బదిలీ చేయడం కానీ చేయలేమని స్పష్టం చేసింది. అలాగే నోబెల్ ఫ్రైజ్ను రద్దు కూడా చేయలేమని కుండబద్దలు కొట్టింది. నోబెల్ కమిటీ క్లారిటీతో నోబెల్ బహుమతిని ఇతరులతో షేర్ చేసుకోలేమనే విషయం తేటతెల్లమైంది. ఇదే ఇప్పుడు ట్రంప్కు పుండు మీద కారం చల్లినట్లైంది. ఎందుకంటే 2025 నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ గంపెడాశలు పెట్టుకున్నారు.
తాను 8 యుద్ధాలు ఆపానని.. నోబెల్ పీస్ ఫ్రైజ్కు తాను అన్ని రకాల అర్హుడినని ఆయనకు ఆయనే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నారు. పాకిస్థాన్, ఇజ్రాయెల్ వంటి అమెరికా మిత్ర దేశాలు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫారసు కూడా చేశాయి. కానీ ఇవేవి పరిగణలోకి తీసుకుని నోబెల్ కమిటీ.. 2025 నోబెల్ పీస్ ఫ్రైజ్ను వెనిజులా ప్రతిపక్ష నేత కొరినా మచాడోకు ప్రదానం చేసింది. దీంతో ట్రంప్కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో తన అవార్డును ట్రంప్కు అంకితం చేస్తు్న్నట్లు ప్రకటించింది మచాడో.
►ALSO READ | రష్యా అధ్యక్షుడు పుతిన్ని కూడా వెనిజులా మదురోలా ఎత్తుకెళతారా..? ట్రంప్ కీలక కామెంట్స్..
దీంతో బాధలో ఉన్న ట్రంప్కు ఈ వార్త కాస్తా ఉపశమనం కల్పించింది. ఇందులో భాగంగానే వచ్చే వారం అమెరికా సందర్శించినప్పుడు మచాడో తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలన్న ప్రతిపాదన గురించి చర్చిస్తానని ట్రంప్ శనివారం అన్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన గంటల్లోనే నోబెల్ కమిటీ స్పందించింది. నోబెల్ బహుమతిని ఇతరులతో పంచుకోవడం, బదిలీ చేయడం కానీ చేయలేమని.. అలాగే నోబెల్ ఫ్రైజ్ను రద్దు కూడా చేయలేమని క్లారిటీ ఇచ్చింది. నోబెల్ కమిటీ వివరణతో ట్రంప్ కు కాస్తా సంతోషం కూడా లేకుండా పోయింది.
