
హైదరాబాద్, వెలుగు: కామన్వెల్త్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన మద్దుకూరి రితేష్ సిల్వర్ మెడల్తో మెరిశాడు. శ్రీలంకలోని వస్కదువా వేదికగా మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో అండర్10 కేటగిరీలో రన్నరప్గా నిలిచాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న రితేష్ తొమ్మిది రౌండ్లకు గాను 6.5 పాయింట్లతో రెండో స్థానం సాధించాడు.