కరోనా వల్ల అనాథలైన పిల్లలతో మధ్యప్రదేశ్ సీఎం దీపావళి వేడుకలు

కరోనా వల్ల అనాథలైన పిల్లలతో మధ్యప్రదేశ్ సీఎం దీపావళి వేడుకలు

కరోనా కారణంగా అనాథలైన చిన్నారులతో దీపావళిని జరుపుకున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో గడిపారు. తన సతీమణితో కలిసి అధికారిక నివాసంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. పిల్లలకు స్వీట్స్ తినిపించారు. తన సతీమణితో కలసి భోజనం వడ్డించారు. వారి ముఖంలో చిరునవ్వు తనకు సంతోషాన్నిస్తోందని శివరాజ్ చెప్పారు. జీవితంలో ఎప్పుడూ నిరాశ పడకూడదని వారికి సూచించారు శివరాజ్ సింగ్ చౌహాన్. జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని చెప్పారు. తాను వారికి మేనమామలా అండగా నిలుస్తానని, తమ మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తానని సీఎం చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

గుజరాత్‌లోని ద్వారకలో భూకంపం

ముంబైలో రూ. 4 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

బంగ్లాదేశ్‌ నుంచి గోల్డ్ స్మగ్లింగ్.. వైజాగ్‌లో స్మగ్లర్ అరెస్ట్