‘ప్రేమమ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ను సొంతం చేసుకుంది మడోనా సెబాస్టి యన్. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాల్లో వరుస సినిమాలు చేస్తోంది.
రీసెంట్గా విజయ్ ‘లియో’లో తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాకు జంటగా నటించే చాన్స్ అందుకుంది మడోనా. ప్రభుదేవా హీరోగా శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోయిన్గా మడోనాను ఫిక్స్ చేశారు. ఇదొక లవ్ స్టోరీ అని, కథ వినగానే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ‘జాలియో జింఖానా’ అనే టైటిల్ను ఫైనల్ చేశారు. యోగిబాబు, యాషిక ఆనంద్, అభిరామి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రభుదేవా, శక్తి చిదంబరం కాంబినేషన్లో చార్లీ చాప్లిన్ చిత్రం రెండు భాగాలుగా వచ్చి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు వీరి కాంబోలో రానున్న మూడో చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రాజేంద్ర రాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.