నిజాలు మాట్లాడితే బీజేపీ తట్టుకోలేకపోతుంది

నిజాలు మాట్లాడితే బీజేపీ తట్టుకోలేకపోతుంది

నిజాలు మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. డేటా అడిగితే FIR రిజిస్టర్ చేశారని ఆరోపించారు. కరోనా కారణంగా భారత్ మహాన్ అనే స్థితిని దేశం కోల్పోయింది అని తానంటే... తనను దేశ ద్రోహిగా చిత్రిస్తున్నారని కమల్ నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో ఎంతమంది చనిపోయారో లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ తాను అడుగుతుంటే... తాను రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు కమల్ నాథ్.