3న లుంబినీ పార్కులో మహా బతుకమ్మ

3న లుంబినీ పార్కులో మహా బతుకమ్మ
  • పోస్టర్ ఆవిష్కరించిన టీఎన్జీవో

టీఎన్జీవో ఆధ్వర్యంలో అక్టోబర్ 3న హైదరాబాద్ లోని లుంబినీ పార్కులో మహా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తెలిపారు. దీనికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ హాజరవుతారని చెప్పారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను శుక్రవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్​లో కారం రవీందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్, రేచల్ విడుదల చేశారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు పెద్ద పెట్టున పాల్గొనాలని పిలుపునిచ్చారు.