తొర్రూరు(పెద్దవంగర), వెలుగు: అద్దె చెల్లించడం లేదని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర ఎంపీడీవో ఆఫీస్కు మంగళవారం బిల్డింగ్ ఓనర్ రాంపాక నారాయణ తాళం వేశాడు. దీంతో కొన్ని గంటల పాటు అధికారులు, ప్రజలు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. పెద్దవంగర మండలంగా ఏర్పడినప్పటి నుంచి ఎంపీడీవో ఆఫీస్ అద్దె భవనంలో కొనసాగుతోంది. 30 నెలల అద్దె రూ.2.10 లక్షలు, కరెంట్ బిల్లు బకాయి రూ.1.76 లక్షలు ఉందని ఓనర్ తెలిపాడు. త్వరలో పెండింగ్ కిరాయి చెల్లిస్తామని ఎంపీడీవో వేణు మాధవ్ చెప్పడంతో శాంతించిన ఓనర్ తాళం తీశాడు.
