
మహబూబాబాద్, వెలుగు: కోతుల బెడద నివారించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందిస్తారు. అందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఈశ్వరలింగం కోతుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశాడు. కాగా, లేఖ అందినట్లు రాష్ట్రపతి భవనం నుంచి సమాచారం అందడంతో, ఆయన రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.