
మహబూబాబాద్, వెలుగు: గార్ల పీహెచ్సీ, పశు వైద్యశాల, హైస్కూల్ను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్స్లో మందులు, రికార్డులను పరిశీలించారు. స్కూల్లో విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. పిల్లలకు డిజిటల్పాఠాలు బోధించాలని, పౌష్టికాహారం అందించాలని టీచర్లకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
నల్లబెల్లి, వెలుగు: గుండ్లపహాడ్, రుద్రగూడెం హైస్కూళ్లు, బోల్లనిపల్లి ప్రైమరీ స్కూల్ను కలెక్టర్సత్యశారద గురువారం తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో తెలుగు, ఇంగ్లిష్పాఠాలు చదివించారు. అనంతరం యూరియా గోదాంలను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అనురాధ, తహసీల్దార్ కృష్ణ, ఎస్సై గోవర్ధన్ పాల్గొన్నారు.