మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సాలార్ నగర్ గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూ ఆధార్ సర్వే పైలట్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు.బుధవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో మీటింగ్ నిర్వహించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామంలోని భూమి వివరాలను స్పష్టమైన సరిహద్దులతో, ఖచ్చితమైన అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్డీవో నవీన్, సర్వే ల్యాండ్ ఏడీ అశోక్ పాల్గొన్నారు.
