మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేతలకు భద్రతను తగ్గించింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కు భద్రతను ప్రభుత్వం తగ్గించింది. ఫడ్నవిస్ కు జెడ్ ప్లస్ నుంచి వై ప్లస్ కు, ఆయన భార్యతో పాటు కూతురుకు వై కేటగిరి నుంచి ఎక్స్ కేటగిరికి తగ్గించారు. రాజ్ థాక్రేకు జడ్ నుంచి వై ప్లస్ కు తగ్గించారు.
అంతేగాకుండా బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివార్ సహా కొంతమంది బిజెపి నాయకుల భద్రతను కూడా తొలగించింది. మంత్రి రామ్దాస్ అథవాలే , మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణేలకు కూడా భద్రతను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. తనకు భద్రతను తగ్గించడం వల్ల ఎటువంటి నష్టం లేదన్నారు ఫడ్నవిస్..తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా భద్రతను కోరలేదన్నారు.
డాక్టర్ల నిర్లక్ష్యం..కడుపులోనే పసికందు మృతి
I never asked for security even when I was state president. I got it for the first time when I became CM & when I got threats after Yakub Memon's death sentence & other instances. I feel it should be given based on threat perception: Devendra Fadnavis, LoP in Maharashtra Assembly https://t.co/ujLbKsaSNO pic.twitter.com/kwp9bGrWEm
— ANI (@ANI) January 10, 2021