డబ్బులు రావట్లేదని.. ఏటీఎం​నే పగలగొట్టిండు

డబ్బులు రావట్లేదని.. ఏటీఎం​నే పగలగొట్టిండు

బోధన్​,వెలుగు : పట్టణంలోని పాతబస్టాండ్​ సమీపంలోని కొండయ్యచౌదరి పెట్రోల్​ బంక్​ వద్ద ఉన్న ఎస్​బీఐ ఏటీఎంను బోధన్​ మండలం సిద్దాపూర్​ గ్రామానికి చెందిన మహేశ్​ మంగళవారం రాత్రి పగలగొట్టాడు.  ఏటీఎంలో నుంచి డబ్బులు రావడంలేదని  ఈ పని చేశాడు .

పెట్రోల్​ బంక్​లో ఉన్నా వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ వీరయ్య ఘటన స్థలానికి చేరుకొని మహేశ్ ను పట్టుకొని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. మహేశ్​​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరయ్య తెలిపారు.