మహింద్రా కొత్త బొలెరో లాంచ్

మహింద్రా కొత్త బొలెరో లాంచ్

మహింద్రా అండ్ మహింద్రా కొత్త బొలెరో కేంపర్ గోల్డ్ జెడ్‌‌ఎక్స్‌‌ను తెలంగాణ మార్కెట్‌‌లోకి లాంచ్ చేసింది. ఈ వెహికిల్​ ధర రూ.7.28 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ వెహికిల్‌‌ను తెలంగాణ ప్లాంట్ జహీరాబాద్‌‌లో తయారు చేసింది.

కొత్త వెహికిల్‌‌తో పాటు బొలెరో కేంపర్ రేంజ్‌‌ను జహీరాబాద్‌‌ ప్లాంట్‌‌లోనే తయారు చేస్తున్నట్టు ఎం అండ్ ఎం ఆటోమొటివ్ డివిజన్ మార్కెటింగ్, వైస్‌‌ ప్రెసిడెంట్ విక్రమ్ గర్గ్​ చెప్పారు. కమర్షియల్ వెహికిల్ రేంజ్‌‌లో బొలెరో తమ ఫ్లాగ్‌‌షిప్ బ్రాండ్‌‌ అని,  86 శాతం మార్కెట్‌‌ షేరుతో ఇది లీడర్‌‌‌‌గా ఎదిగిందని  తెలిపారు.